Skip to main content

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తృటిలో తప్పిన చెప్పుదెబ్బ!


శతాధిక చిత్రాల దర్శకుడు, అన్నమయ్య, రామదాసువంటి 'కళాఖండాల' సృష్టికర్త కె.రాఘవేంద్రరావు గతంలో ఒకసారి ప్రముఖ నిర్మాత కె.మురారి చెప్పుదెబ్బనుంచి తృటిలో తప్పించుకున్నారట. ఈ వైనాన్ని మురారి ఇవాళ చెన్నైలో స్వయంగా వివరించారు. 

చెన్నైలో నివసిస్తున్న మురారి ఇవాళ ఒక పుస్తకా‌విష్కరణ కార్యక్రమం సందర్భంగా విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రాఘవేంద్రరావుకు గీతం యూనివర్సిటీ యాజమాన్యం డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించడంపై స్పందించారు. సంస్కారహీనుడైన రాఘవేంద్రరావుకు డాక్టరేట్ ఇవ్వటంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీ డాక్టరేట్‌లు ప్రకటింటిన ముగ్గురిలో మిగిలిన ఇద్దరి విషయంలో ఎవరూ వేలెత్తి చూపాల్సిన అవసరంలేదని, అయితే రాఘవేంద్రరావుకు ఇవ్వటం సరైన నిర్ణయం కాదని మురారి అన్నారు. గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మూర్తి అంటే తనకెంతో గౌరవం ఉందని చెప్పారు. 

ఇక రాఘవేంద్రరావు గురించి చెప్పుకొస్తూ, అతనికి సంస్కారం లేదని, పెద్దలంటే గౌరవంలేదని మురారి అన్నారు. ఒకసారి అతను తమ ఇంటికి వచ్చినపుడు తమ ఇంటి హాల్‌లో తన తల్లిదండ్రుల ఫోటోను చూశాడని, ఆ ఫోటోలోని తన తల్లిని ఉద్దేశించి ఏమిటి నల్లగా, అంత అసహ్యంగా ఉందని రాఘవేంద్రరావు అన్నాడని మురారి చెప్పారు. ఆ మాటలతో తాను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. తాను తేరుకుని స్పందించేలోపు, రాఘవేంద్రరావు తన భావాలను గమనించి వెంటనే వడివడిగా బయటకెళ్ళిపోయి కారులో ఉడాయించాడని మురారి చెప్పారు. తాను చెప్పుతీసేలోపుగానే ఇదంతా జరిగిపోయిందని తెలిపారు. రాఘవేంద్రరావు తనకు డబ్బలుకూడా ఎగ్గొట్టాడని చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్‌‌లగురించి హేళనగా, చౌకబారుగా వ్యాఖ్యానిస్తాడని అన్నారు. అలాంటి సంస్కారహీనుడికి డాక్టరేట్ ఇవ్వటం ఏవిధంగా సముచితమని ప్రశ్నించారు. మురారి వ్యాఖ్యలపై10టీవీలో వార్తను ఈ లింక్‌లో చూడొచ్చు. మురారి యథాతథంగా చెప్పినమాటలను ఈ లింక్ లో చూడొచ్చు.

నిజానికి, వివాదరహితుడిగా తన అభిమానులతో, తన వర్గంవారితో కీర్తించబడే రాఘవేంద్రరావు ఖాతాలో ఒకటి రెండు వివాదాలు లేకపోలేదు. సుమారు పదిహేను ఏళ్ళక్రితం ఒక అమ్మాయి వివాదంలో నటుడు రాజశేఖర్ దర్శకేంద్రుడిని ఇంటికెళ్ళిమరీ బట్టలు చిరిగిపోయేవరకు కొట్టటం, అంతకుముందు సిల్క్ స్మితకు ఆయనకు మధ్య గొడవ వంటి  'కొద్ది' వివాదాలుమాత్రమే ఆయన కెరీర్‌లో ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్‌2లోని ఆయన మల్టీప్లెక్స్ నిర్మించిన స్థలంపై వివాదం రాజకీయపరమైనది. హైదరాబాద్ లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిని ప్రోత్సహించేదిశగా, రికార్డింగ్ ధియేటర్ కోసం నాటి టీడీపీ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మల్టీప్లెక్స్ నిర్మించటంద్వారా రాఘవేంద్రరావు దానిని వాణిజ్య అవసరాలకోసం వాడుకున్నారంటూ కోర్టులో కొందరు కాంగ్రెస్ నాయకులు సవాల్ చేశారు. ఆ రోజుల్లో అసెంబ్లీలో కూడా దానిపై పెద్ద గొడవ జరిగింది. 

సీతామాలక్ష్మి, గోరింటాకు వంటి చక్కటి చిత్రాలకు నిర్మాతగా ప్రసిద్ధిగాంచిన మురారి, రాఘవేంద్రరావు దర్శకత్వంలో త్రిశూలం, జానకిరాముడు అనే చిత్రాలను నిర్మించారు.

అయితే, మురారి ప్రస్తావించిన విషయానికి ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా ప్రాధాన్యత లభించకపోవటం కాకతాళీయమో, మరేదైనా మతలబు ఉందో అనేదిమాత్రం తెలియటంలేదు.

                                                          ***

Comments

  1. -పదేళ్ళక్రితం ఒక అమ్మాయి వివాదంలో నటుడు రాజశేఖర్ దర్శకేంద్రుడిని ఇంటికెళ్ళిమరీ బట్టలు చిరిగిపోయేవరకు కొట్టటం
    -నర్తకి సిల్క్ స్మితకు ఆయనకు మధ్య గొడవ
    - బంజారాహిల్స్ రోడ్ నంబర్‌2లోని ఆయన మల్టీప్లెక్స్ నిర్మించిన స్థలంవివాదం
    -తన తల్లిని ఉద్దేశించి ఏమిటి నల్లగా, అంత అసహ్యంగా ఉందని రాఘవేంద్రరావు అన్నాడని
    -రాఘవేంద్రరావు తనకు డబ్బలుకూడా ఎగ్గొట్టాడని
    అత్యంత వివాదరహితుడు అన్న మాట

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.