ఎన్టీఆర్
జీవితం
ఆధారంగా
మూడు-నాలుగు
బయోపిక్లు రూపొందబోతున్నాయన్న
వార్తలతో
ఆయన పేరు మళ్ళీ ఒక్కసారిగా
కేంద్రబిందువు అయిన సంగతి
తెలిసిందే.
మరోవైపు
తమిళనాడులో ఎంజీఆర్ జీవితం
ఆధారంగా కూడా తాజాగా ఒక
చలనచిత్రం ప్రారంభమైంది.
ఈ
సందర్భంగా వీరిరువురి
జీవితాలమధ్య పోలిక రావటం
అనివార్యం.
అయితే,
తమిళనాడు
రాజకీయాలను దగ్గరనుంచి చూసిన
తెలుగువారందరికీ,
ఎంజీఆర్...
రామారావుకంటే
ఎన్నోరెట్లు పాపులర్ నేత
అన్న సంగతి తెలిసిందే.
రామారావు
జీవితంలో బ్రహ్మాండమైన
విజయాలవంటి ఉత్థానాలతోబాటు,
ఘోర
పరాజయాలు,
వెన్నుపోట్లు
వంటి పతనాలు కూడా ఉన్నాయి.
ఇక
ఆయన చరమాంకం అయితే ఒక నల్లటి
మచ్చగా మిగిలిపోయిన సంగతి
తెలిసిందే.
సొంతవాళ్ళే
వెన్నుపోటు పొడిచి గద్దెనుంచి
తనను దించేశారన్న మానసికక్షోభతోనే
ఎన్టీఆర్ ప్రాణాలు విడిచారు.
ఎంజీఆర్
పరిస్థితి అలాకాదు…To Read Full Article, Click Here
నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని
Comments
Post a Comment