Skip to main content

Posts

Showing posts from March, 2018

ఏపీలో పీక్స్‌కు చేరిన కులపిచ్చి: కమ్మ, రెడ్డి వర్గాల్లో తీవ్ర అసహనం!

చంద్రబాబునాయుడిని ఎవరైనా విమర్శిస్తే కమ్మవారు భగ్గుమని మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా తప్పుబడితే రెడ్లు నిప్పులు చెరుగుతున్నారు. ఆ మధ్య 'అసహనం' అనే మాట దేశాన్ని పట్టికుదిపేసిన సంగతి తెలిసిందే. ముస్లిమ్, దళిత వర్గాలపై సంఘ్ పరివార్ హిందుత్వ శక్తులు దాడులకు పాల్పడటాన్ని మత అసహనంగా విపక్షాలు, ప్రజాసంఘాలు అభివర్ణించాయి. ఇప్పుడు ఏపీలో అలాంటిదే ఒక అసహనం చోటుచేసుకుంటోంది... కమ్మ, రెడ్డి సామాజికవర్గాలలో. వారి వారి కులాలకు చెందిన పార్టీలపై, తమ కుల అధినేతలపై ఎవరైనా విమర్శలు చేస్తే లేశమైనా తాళలేకపోతున్నారు... విమర్శకులను దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రెండువర్గాలలో నూటికి 95శాతం మంది ఇలాగే మాట్లాడుతున్నారు... వ్యవహరిస్తున్నారు. పరస్పర భౌతికదాడులైతే జరగటంలేదుగానీ కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నాయి. సోషల్ మీడియాలో ఈ రెండువర్గాల మధ్య పానిపట్టుయుద్ధం, తళ్ళికోటయుద్ధం స్థాయిలో పరస్పరదాడులు జరుగుతున్నాయి. తీవ్రఅసహనంతో రగిలిపోతున్న ఈ రెండు సామాజికవర్గాల వైఖరిని ఒకసారి పరిశీలిద్దాం.To Read the Full Story, Click Here.

చంద్రబాబునాయుడు 4 ఏళ్ళ పాలనలోని 10 తీవ్ర తప్పిదాలు!

చంద్రబాబు 1995 లో ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవటంలోగానీ , 1996 లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ తో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించటంలోగానీ , 1999 లో ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని తిరిగి అధికారంలోకి రావటంలోగానీ - ప్రదర్శించిన రాజకీయ చతురత , వ్యవహారదక్షత అందరికీ తెలిసిందే . మరి నాటి ఆ సామర్థ్యం , దూకుడు ఏమయ్యాయోగానీ 2014 లో అధికారంలోకి వచ్చిననాటినుంచి పరిశీలిస్తే , ఆయన వ్యవహారశైలి , తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూయిష్టంగానూ , అవకతవకలుగానూ ఉంటున్నాయి . ముఖ్యంగా ఆయన చేసిన ' ఓటుకు నోటు కేసు ' అనే ఒక్క తప్పిదం (blunder) తాలూకు మూల్యాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం భరించాల్సివస్తోంది . ఒకనాడు కేంద్రంలో చక్రం తిప్పిన ఆ బాబు ఇప్పుడు ఈ కేసు కారణంగా మోడి ముందు మోకరిల్లుతున్నారు . తద్వారా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోగానీ , ప్యాకేజి విషయంలోగానీ కేంద్రంనుంచి చట్టం ప్రకారం రావాల్సినవాటిని డిమాండ్ చేసే హక్కును (bargaining capacity) ని కూడా కోల్పోవటం ఏపీ ప్రజలపాలిట దురదృష్టంగా మారింది . మరోవైపు ఈ కేసుకారణంగా చంద్రబాబు ఏపీ ప్రజలతోబాటు అటు తెలంగాణలో సొంత పార్టీ శ్రేణులకు